లోక్‌సభ ఎన్నికల్లో బోణీ కొట్టిన బీజేపీ.. సూరత్‌లో ఏకగ్రీవం

73చూసినవారు
లోక్‌సభ ఎన్నికల్లో బోణీ కొట్టిన బీజేపీ.. సూరత్‌లో ఏకగ్రీవం
లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందే బీజేపీ ఖాతా తెరిచింది. గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ స్థానం ఏకగ్రీవం కానుంది. అక్కడ బీజేపీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థి ముకేశ్‌భాయ్‌ దలాల్‌ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. మిగతా అభ్యర్థులు నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. దీంతో ముకేశ్‌భాయ్‌ దలాల్‌ ఎంపిక ఏకగ్రీవమైనట్లే. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.