కలియుగంలో విశేషమైనది అనగాష్టమి వ్రతం

78చూసినవారు
కలియుగంలో విశేషమైనది అనగాష్టమి వ్రతం
కలియుగంలో విశేషమైనది అనగాష్టమి వ్రతం అని మహబూబ్నగర్ జిల్లా బండ్రవెల్లి దత్తాత్రేయ పీఠం కృష్ణానంద గురు స్వామి తెలిపారు. సోమవారం కాశీంపేట దత్తాత్రేయ మందిరంలో అనగాష్టమి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీజీ మాట్లాడుతూ అనగాష్టమి అనగా లక్ష్మీ పార్వతి సరస్వతి అంశయని అన్నారు. దత్తాత్రేయుడు త్రిమూర్తుల కలయికని తెలిపారు. దత్తాత్రేయుని పూజిస్తే ఆరుగురు దేవతలను పూజించినట్లే అని తెలిపారు.

ట్యాగ్స్ :