టీ20 వరల్డ్ కప్లో నేపాల్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్లో నేపాల్పై సౌతాఫ్రికా 1 పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 115/7 స్కోరు సాధించింది. ఛేదనలో నేపాల్ 114/7 స్కోరు మాత్రమే చేసి ఓటమి పాలైంది. చివరి ఓవర్లో నేపాల్కు 8 పరుగులు అవసరం అయ్యాయి. చివరి బంతికి నేపాల్ బ్యాటర్ గుల్సన్ జా రనౌట్ అయ్యాడు.