వరల్డ్ కప్ లో సత్తా చాటిన తెలుగమ్మాయి

5227చూసినవారు
వరల్డ్ కప్ లో సత్తా చాటిన తెలుగమ్మాయి
మహిళల క్రికెట్ లో తొలిసారి నిర్వహించిన అండర్-19 టీ20 వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకుంది. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో తెలుగమ్మాయి గొంగడి త్రిష తన సత్తా చాటింది. అండర్-19 టీ20 వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ గా నిలిచింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన త్రిష 12 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికైంది. లెగ్ స్పిన్ వేసే త్రిష, బ్యాటింగ్ లోనూ రాణిస్తూ ఆల్ రౌండర్ గా పేరు సంపాదించింది.