గుప్త నిధుల కోసం ఆలయం ధ్వంసం! (వీడియో)

56చూసినవారు
ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా ములకల చెరువు గ్రామానికి సమీపంలో ఉన్న శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. పునాదులతో సహా ఆలయాన్ని కూల్చివేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. సీఎం చంద్రబాబు స్పందించి.. దుండగులను వెంటనే గుర్తించి చట్ట ప్రకారం శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు ఆదేశించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుప్త నిధుల కోసమే ఆలయాన్ని కూల్చినట్లు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్