బాలీవుడ్ ప్రేమ జంట ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే బ్రేకప్ చెప్పుకున్నారు. రెండేళ్లు డేటింగ్లో ఉన్న ఈ జంట పరస్పర అవగాహనతో విడిపోయినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు కలిసే వారు హాజరయ్యారు. తర్వాత విభేదాలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ బాధ నుంచి బయటపడేందుకు అనన్య తన పెంపుడు కుక్కతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.