కార్మికులను వెంటాడుతున్న ప్రాణభయం

85చూసినవారు
కార్మికులను వెంటాడుతున్న ప్రాణభయం
విశాఖ పరిధిలోని పరవాడలో 90 వరకు కంపెనీలు ఉండగా, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ పరిధిలో 208 పరిశ్రమలు ఉన్నాయి. అందులో 130 వరకు రెడ్‌ కేటగిరీకి చెందిన ప్రమాదకర పరిశ్రమలు. అయితే ఫార్మా, కెమికల్‌ పరిశ్రమల్లో రియాక్టర్ల వద్ద ఉష్ణోగ్రతలు, ప్రెషర్‌ గేజ్‌లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. ఒత్తిడి ఎక్కువైనప్పుడు సెన్సర్ల ద్వారా అలారం మోగే వ్యవస్థ కచ్చితంగా ఉండాలి. ఇప్పుడున్న పరిశ్రమల్లో అవిలేకపోవడంతో కార్మికుల్లో ప్రాణభయం వెంటాడుతోంది.

సంబంధిత పోస్ట్