పాతికేళ్ల వయసుకే న్యాయమూర్తి

15336చూసినవారు
పాతికేళ్ల వయసుకే న్యాయమూర్తి
కర్ణాటకకు చెందిన ఎన్. గాయత్రి పాతికేళ్లకే సివిల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కోలాపు సమీప యళబుర్గికి చెందిన గాయత్రి ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసి, కోలూరులో బీకాం చేశారు. 2021 లో న్యాయవిద్య ముగించిన అనంతరం సివిల్ న్యాయమూర్తి పోస్టులకు నిర్వహించిన ముఖాముఖిలో విజయం సాధించలేకపోయినా, రెండో ప్రయత్నంలో సత్తా చాటారు. గాయత్రి తల్లితండ్రులు ఇద్దరు కూలి పనులకు వెళ్తుంటారు.