కొండ చరియలు విరిగిపడిన ఘటన.. 229కు చేరుకున్న మృతుల సంఖ్య

71చూసినవారు
కొండ చరియలు విరిగిపడిన ఘటన.. 229కు చేరుకున్న మృతుల సంఖ్య
ఇథియోపియాలో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 229కు చేరుకుంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు, పోలీసులు ఉన్నారు. రాళ్లలో కూరుకుపోయిన వీరి మృతదేహాలను ఇంకా వెలికితీస్తున్నారు. ఇథియోపియాలోని గోఫా జిల్లాలో తొలుత కొండ చరియలు విరిగిపడగా స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టేందుకు అక్కడికి వెళ్ళారు. ఈక్రమంలో రెండో సారి కొండ చరియలు విరిగిపడి భారీగా ప్రాణనష్టం సంభవించింది.

సంబంధిత పోస్ట్