ఒడిశాలో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు BJP సిద్ధమవుతోంది. సీఎంగా ఎవరిని పీఠమెక్కించబోతోందన్న ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే బీజేపీకి మరో తలనొప్పి మొదలైంది. రాష్ట్ర సీఎం అధికార భవనం కోసం
బీజేపీ అన్వేషణ కొనసాగించాల్సిన పరిస్థితి తలెత్తింది. రెండు దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రిగా కొనసాగిన నవీన్ పట్నాయక్.. తన సొంత ఇంటినుంచే కార్యకలాపాలు సాగించడంతో ఈ సమస్య వచ్చి పడింది.