రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

51చూసినవారు
రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ముస్తాబాద్‌ మండలంలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకొని, ఇసుక ట్రాక్టర్‌కు బందోబస్తుగా ఉండి స్టేషన్‌కు తరలిస్తున్న కానిస్టేబుల్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణపై హత్యాయత్నానికి తెగబడింది. దీంతో ఆ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కావడంతో.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేశారు.