రెండ్రోజుల పాటు పెరగనున్న ఎండలు

560చూసినవారు
రెండ్రోజుల పాటు పెరగనున్న ఎండలు
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ మొదటి వారం నుంచి విపరీతంగా ఎండలు మండుతున్నాయి. నిన్న ఆరు జిల్లాల్లో ఏకంగా 45 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది. ఇవాళ, రేపు సూర్యుని ప్రతాపం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లా మాడుగులపల్లి, మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలాల్లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించింది..