మహారాష్ట్రలోని భీడ్ జిల్లా ధరూర్లో శనివారం దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATMను చోరీ చేశారు. రెయిన్కోట్లు ధరించిన నలుగురు దొంగలు తాళ్లతో ఏటీఎంలోకి ప్రవేశించారు. ఏటీఎం చుట్టూ తాళ్లు బిగించి కారుతో లాగి ఏటీఎంను చోరీ చేశారు. బ్యాంకు సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు 4గం పాటు వేట కొనసాగించి 21 లక్షలకు పైగా నగదు, ATM మెషిన్ను స్వాధీనం చేసుకున్నారు. దొంగలు తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ వైరలవుతోంది.