తిరుమల శ్రీవారి లడ్డూ తయారీని థామస్ అనే కాంట్రాక్టర్కు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై టీటీడీ స్పందించింది. "లడ్డూ తయారీని థామస్ అనే కాంట్రాక్టర్కు ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. శ్రీవారి లడ్డూ తయారీలో ప్రస్తుతం 980 మంది హిందువులు పాల్గొంటున్నారు. లడ్డూను కొన్ని శతాబ్దాలుగా వైష్ణవ బ్రాహ్మణులే తయారు చేస్తున్నారు" అని టీటీడీ తెలిపింది.