లోక్సభ ఎన్నికలకు తేదీలు ప్రకటించేందుకు కొన్ని రోజుల ముందు సీఏఏ అమలు కేవలం రాజకీయ కారణాలతోనే చేపట్టారని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు డ్రామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ చట్టం 2020లో ఆమోదించినా పలు వాయిదాల అనంతరం కేవలం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే రెండు, మూడు రోజుల ముందు అమలుకు పూనుకోవడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని వ్యాఖ్యానించారు.