లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. మే 8, 10 తేదీల్లో ప్రధాని రాష్ట్ర పర్యటన ఖరారైంది. 8న వేములవాడ, వరంగల్ సభలకు మోదీ హాజరుకానున్నారు. 10న మహబూబ్నగర్తో పాటు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగసభలో ప్రధాని పాల్గొననున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.