నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

69చూసినవారు
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన చిల్లకూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను, అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చికిత్సా నిమిత్తం క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్