చార్ధామ్ యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో ఇద్దరు, యమునోత్రి ధామ్లో మరో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు యాత్రలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల సంఖ్య 157కి చేరింది. వీరిలో అత్యధికంగా కేదార్నాథ్లో 73 యాత్రికులు, బద్రీనాథ్లో 38, గంగోత్రిలో 13, యమునోత్రి ధామ్లో 29 మంది ప్రాణాలు విడిచినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి.