ఏపీలో ఇతర రాష్ట్రాల వారికి దక్కిన రెండు మద్యం దుకాణాలు

75చూసినవారు
ఏపీలో ఇతర రాష్ట్రాల వారికి దక్కిన రెండు మద్యం దుకాణాలు
ఏపీలో మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రెండు వైన్‌షాపులను ఇతర రాష్ట్రాలకు చెందిన వారు దక్కించుకున్నారు. పట్టణంలోని 1వ నంబర్‌ దుకాణం కర్ణాటకకు చెందిన మహేశ్‌ ఎ బాతే, 2వ నంబర్‌ షాపు ఉత్తరప్రదేశ్ వాసి లోకేశ్‌ చంద్‌కు దక్కాయి. లాటరీలో వారి పేర్లు రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. మిగిలిన దుకాణాలకు జిల్లా అధికారులు లాటరీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.