వాలెనియన్ రచయితైన విసెంటే క్లావెల్ ఆండ్రెస్కు పుస్తక దినోత్సవం జరపాలని మొట్టమొదటగా ఆలోచన వచ్చింది. ప్రపంచ రచయిత మిగ్యుఎల్ డి సెర్వంటెస్ పుట్టిన తేది (అక్టోబర్ 7)గానీ, మరణించిన తేది (ఏప్రిల్ 23)గానీ పుస్తక దినోత్సవంగా చేయాలనుకున్నారు. అయితే షేక్స్పియర్, గర్సిలాసో, వేగా వంటి రచయితలు మరణించిన తేది, పుట్టిన తేదీ ఏప్రిల్ 23 అవడంవల్ల.. ఆ రోజును ప్రపంచ పుస్తక దినోత్సవంగా నిర్వహించాలని 1995లో యునెస్కో ప్రకటించింది.