వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి (AMU) ఉప కులపతిగా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమె నియామకానికి ఆమోద ముద్ర వేశారు. అనంతరం కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఈ నియామకాన్ని చేపట్టింది. నయీమా AMUకు తొలి మహిళా వీసీగా వచ్చారు. ఐదేళ్లపాటు ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు.