రోడ్డు ప్రమాదాల నివారణకు యూపీ కొత్త ప్రయోగం

65చూసినవారు
రోడ్డు ప్రమాదాల నివారణకు యూపీ కొత్త ప్రయోగం
రోడ్డు ప్రమాదాల నివారణకు ఉత్తరప్రదేశ్‌ రోడ్డు రవాణా శాఖ సరికొత్త విధానానికి తెరతీసింది. కమర్షియల్ వాహనాలు, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ బస్సులు నడిపే డ్రైవర్లు తమ వాహనాల డ్యాష్ బోర్డులపై కుటుంబసభ్యుల ఫొటోలను పెట్టుకోవాలని సూచించింది. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ చంద్ర భూషణ్ సింగ్ డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ఐడియా ఏపీలో మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. ‘‘డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ ఆ ఫొటోలు నిరంతరం గుర్తు చేస్తాయి’’ అని వ్యాఖ్యానించారు.