UPI పేమెంట్ల ఛార్జీలపై షాకింగ్ నిర్ణయం తీసుకున్న యూజర్లు

77చూసినవారు
UPI పేమెంట్ల ఛార్జీలపై షాకింగ్ నిర్ణయం తీసుకున్న యూజర్లు
దేశీయ డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ పేమెంట్లు అగ్రస్థానంలో ఉన్నాయి. కిరాణా దుకాణం నుంచి హాస్పిటల్స్ బిల్లుల వరకు యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో UPI లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై లోకల్ సర్కిల్స్ సర్వే 42,000 మంది నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఛార్జీలు విధిస్తే యూపీఐ ట్రాన్సాక్షన్లు చేయడం ఆపేస్తామని దాదాపు 75 శాతం మంది చెప్పగా.. 25 శాతం మంది రుసుము విధించినా పర్లేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్