వరద జాబితాలో పేర్లు గల్లంతు.. బాధితుల ఆందోళన (వీడియో)

73చూసినవారు
విజయవాడలో వరద బాధితుల జాబితాను అధికారులు విడుదల చేశారు. అయితే ఇందులో కొందరి పేర్లు గల్లంతవ్వడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. సచివాలయాలకు చేరుకుని సిబ్బందిని ప్రశ్నించారు. తక్షణమే జాబితాను సవరించాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ నెల 25న వరద బాధితులకు ప్రభుత్వం పరిహారం అందించనుంది. గ్రౌండ్ ఫ్లోర్ నీట మునిగిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో నీట మునిగిన వారికి రూ.10 వేలు ఇవ్వనుంది.

సంబంధిత పోస్ట్