యూపీలో బీజేపీని ఓడించి ప్రజలు హింసకు వ్యతిరేకంగా తీర్పిచ్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వారణాసిలో ప్రధాని మోదీ తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందని, ద్వేషం.. హింసకు చోటు లేదని ప్రజలు సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు ప్రకటనలు చేశారని, ఎన్నికల తర్వాత రాజ్యాంగ ప్రతిని మోదీ నుదుటికి అద్దుకున్నట్లు గుర్తు చేశారు.