గల్ఫ్‌ ఏజెంట్‌ మోసం చేశాడని బాధితుల ఆందోళన

555చూసినవారు
గల్ఫ్‌ ఏజెంట్‌ మోసం చేశాడని బాధితుల ఆందోళన
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో గల్ఫ్‌ ఏజెంట్‌ మోసం చేశాడని బాధితులు ఆందోళన చేపట్టారు. ఏజెంట్‌ ఇంటి వద్ద 60 మంది బాధితుల ఆందోళనకు దిగారు. దుబాయ్‌ పంపిస్తామని డబ్బులు వసూలు చేసినట్లు బాధితుల ఆరోపించారు. ఒక్కొక్కరి నుంచి ఏజెంట్‌ రూ.50 వేలు నుంచి రూ.60 వేలు వసూలు చేశారన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్