గుజరాత్లోని కచ్ జిల్లా భుజ్లో గురువారం అనూహ్య ఘటన జరిగింది. భారీ వర్షాలతో పాటు ధనశ్యామ్ నగర్లోని ఓ భవనంపై పిడుగు పడింది. దీంతో బాల్కనీలో కొంత భాగం కుప్పకూలింది. ఆ ప్రాంతంలో విద్యుత్ తీగలు ఉన్నాయి. అంతేకాకుండా కింద గ్యాస్ సిలిండర్లు కూడా ఉంచారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ సమయంలో అక్కడ ఇద్దరు భయంతో పరుగులు తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.