వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

67చూసినవారు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్, సాల్విడ్ గ్రామాలలో సోమవారం ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మురళి మాట్లాడుతూ. రైతులు మధ్యవర్తులను ఆశ్రయించి నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శోభ, తదితరులు పాల్గొన్నారు.