గోవిందరావు పేట - Govindaraopeta

ఉమ్మడి వరంగల్ జిల్లా
Apr 16, 2025, 17:04 IST/పాలకుర్తి
పాలకుర్తి

జనగామ: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం పట్ల ఆందోళన

Apr 16, 2025, 17:04 IST
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల బుధవారం గర్భంలో శిశువు మృతి చెందిందని హాస్పిటల్ ఎదుట మృత శిశువుతో బంధువులు ఆందోళన చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో పురిటి నొప్పులతో సామాజిక ఆరోగ్య కేంద్రంలో అడ్మిట్ అయిన గర్భవతి ని ఈ రోజు సాయంత్రం వరకు నార్మల్ డెలివరీ కోసం వేచి చూసిన వైద్యులు, తల్లికి ఆక్సిజన్ అందక బేబీకి హార్టు బీట్ తగ్గిందని ప్రాణ హాని ఉందని మీకు నచ్చిన హాస్పిటల్ తీసుకొమ్మని వైద్యులు చేతులు ఎత్తేశారు. వెంటనే హుటాహుటిన ప్రైవేటు హాస్పిటల్ కి తరలించగా బేబీ చనిపోయిందని చెప్పిన ప్రైవేటు వైద్యులు తెలిపారు.