రామన్నగూడెంలో పిడుగుపాటుతో గేదే మృతి
కొడకండ్ల మండలంలోని రామన్నగూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా పిడుగు పడటంతో నర్ర సోమనారి అనే రైతుకు చెందిన సుమారు రూ.55,000 విలువ గల సూడి గేదే చనిపోవడం జరిగింది. దీంతో రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.