కాల్వపల్లి గ్రామాన్ని సందర్శించిన తాడ్వాయి తహశీల్దార్

76చూసినవారు
కాల్వపల్లి గ్రామాన్ని సందర్శించిన తాడ్వాయి తహశీల్దార్
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాల్వపల్లి గ్రామాన్ని తహశీల్దార్ తోట రవీందర్, అధికారులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా తూముల వాగు, నాగమయ్యకుంట కింద ముంపుకు గురైన ఇళ్లను పరిశీలించి వరద వస్తే ట్రైబల్ వెల్ఫేర్ స్కూలుకు వెళ్లాలని గ్రామస్తులకు సూచించారు. అదేవిధంగా గ్రామంలో ప్రజలకు తగు జాగ్రత్తలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీధర్ రావు, ఆర్ఐ కీసర రాజు కుమార్, బోడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you