వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ సెంటర్ లో ఆదివారం నెక్కొండ మండల మేరు సంఘం ఆధ్వర్యంలో సిఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మేరు కులానికి మేర కార్పొరేషన్ ను ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, దొంతి మాధవ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.