డెమోగ్రఫిక్ డివిడెండ్ కారణంగా కలిగే ప్రయోజనాలను భారత్ పొందలేకపోతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ‘మేకింగ్ ఇండియా యాన్ అడ్వాన్స్ ఎకానమీ బై 2047’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. యువతలో నైపుణ్యాల మెరుగుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశం మొత్తం జనాభాలో పనిచేయని వారితో పోలిస్తే పనిచేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్గా పేర్కొంటారు.