భారత్- దుబాయ్ మధ్య 28 విమానాల రద్దు

73చూసినవారు
భారత్- దుబాయ్ మధ్య 28 విమానాల రద్దు
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన దుబాయ్ భారీ వర్షాలతో స్తంభించిపోయింది. వర్షాల కారణంగా భారత్- దుబాయ్ మధ్య 28 విమానాలు రద్దయ్యాయి. భారత సివిల్ ఏవియేషన్ శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్లే 15, అక్కడి నుంచి వచ్చే 13 విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్