1906లో తన 16వ ఏట సర్వేపల్లి రాధాకృష్ణన్కు శివకామేశ్వరితో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆయన సతీమణి 1956లో తన 51వ ఏట మరణించారు. తెలివితేటలకు ఉపాధ్యాయులు ముగ్ధులయ్యేవారు. సర్వేపల్లి 21 ఏళ్ల వయస్సులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు. తత్వశాస్త్రంలో ఆయన ప్రతిభను గుర్తించిన మైసూరు విశ్వవిద్యాలయం ఆయన్ని ప్రొఫెసర్గా ఆహ్వానించింది.