కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చాం: జస్టిస్‌ ఎల్.నరసింహారెడ్డి

85చూసినవారు
కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చాం: జస్టిస్‌ ఎల్.నరసింహారెడ్డి
విద్యుత్‌ కొనుగోళ్లు అంశంపై మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చామని జస్టిస్‌ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు. 'విద్యుత్‌ కొనుగోళ్లలో కేసీఆర్‌ సహా 25 మందికి నోటీసులు ఇచ్చాము. వివరణ ఇచ్చేందుకు కేసీఆర్‌ జులై 30 వరకు సమయం అడిగారు. జూన్‌ 15 వరకు వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు తెలిపాం. 2016లో రెగ్యులేటరీ కమిషన్‌కు అర్వింద్‌ కుమార్‌ విద్యుత్‌ కొనుగోళ్లపై ఆర్థిక భారం పడుతుందని.. ఓపెన్‌ బిడ్డింగ్‌ ద్వారా డబ్బు ఆదా అవుతుందని లేఖ రాశారు. ఆ తర్వాత సెక్రటరీగా లేనని అర్వింద్‌ చెప్పారు' అని అన్నారు.