అమెరికాలోని టెక్సాస్ నగరంలో ఏపీలోని బాపట్ల వాసి దాసరి గోపికృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. డాలస్ సూపర్ మార్కెట్లో దుండగుడి కాల్పులకు తెగబడగా గోపికృష్ణ మృతి చెందాడు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని భారత్కు తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.