భారతదేశంలోని టాప్-10 నగరాల్లో ఏడాదికి 33,000 మందికిపైగా మరణాలు వాయు కాలుష్యం కారణంగానే జరుగుతున్నాయని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అధ్యయనం తెలిపింది. ఈ జాబితాలో 12,000 మరణాలతో ఢిల్లీనే టాప్లో ఉందని పేర్కొంది. తర్వాతి స్థానాల్లో వరుసగా అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబై, పూణే, సిమ్లా, వారణాసి ఉన్నాయి.