పెట్రోల్, డీజిల్ వాహనాలను నిర్మూలిస్తాను: గడ్కరీ

3632చూసినవారు
పెట్రోల్, డీజిల్ వాహనాలను నిర్మూలిస్తాను: గడ్కరీ
దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాలను నిర్మూలిస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇది పూర్తిగా వదిలించుకోవడం కష్టమే కానీ అసాధ్యం కాదన్నారు. మరోవైపు హైబ్రీడ్ వాహనాలపై ఉన్న జీఎస్టీని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇంధన దిగుమతులపై భారత్ ఏటా రూ.16 లక్షల కోట్లు వెచ్చిస్తోందని, ఈ డబ్బును రైతుల జీవితాల మెరుగుదలకు వినియోగిస్తామని, తద్వారా గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని వివరించారు.