బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు కష్టం కలిగిస్తున్నాయి. జిల్లాల ఏర్పాటులో ఎలాంటి సూత్రాలు పాటించకుండా జిల్లాల సంఖ్య పెంచడంతో ఏం తోచని పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ నియోజకవర్గాల పరంగా చూసినా 17 జిల్లాలే అవసరమవుతాయి. జనాభా పరంగా చూసినా 22 జిల్లాలు కావాలి. ఇప్పుడు జిల్లాల సంఖ్య కుదించాలని రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తోంది. కానీ ఆ పని చేస్తే బీఆర్ఎస్ సెంటిమెంట్ ను రాజేసి లేనిపోని ఉద్యమాలు చేసే అవకాశం ఉండటంతో కాంగ్రెస్కు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి.