రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ పట్టాలపై పడిపోయిన యువతి(వీడియో)

77చూసినవారు
ఝార్ఖండ్ లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతి కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అదుపుతప్పి పట్టాలపై పడిపోయింది. మోనికా కుమారి(21) తమిళనాడు వెళ్లే ట్రైన్ ఎక్కుతుండగా కాలుజారి రైలు పట్టాలపై పడిపోయింది. గమనించిన లోకోపైలెట్ వెంటనే ట్రైన్ ఆపేశాడు. అనంతరం రైల్వే పోలీసులు, మిగతా ప్రయాణికులు ఆమెను పైకి లాగారు. యువతి సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :