కత్తితో గొంతు కోసి వ్యక్తి హత్య

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలంలో దారుణం జరిగింది. చిన్నసిర్లాం గ్రామానికి చెందిన సంగాం కోర్టు గుమస్తాగా విధులు నిర్వహించి రిటైర్ అయ్యాడు. టీడీపీలో కీలక నేతగా కొనసాగుతున్నాడు. అయితే ఇంటి బయట నిద్రిస్తున్న సంగాంను కొందరు దుండగులు కత్తితో గొంతు కోసి హతమార్చారు. అయితే దీన్ని రాజకీయ హత్యగా మృతుడి బంధువులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :