మాజీ సైనికుడి హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

62చూసినవారు
మాజీ సైనికుడి హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
విశాఖలోని గాజువాక జగ్గు జంక్షన్‌ వద్ద మాజీ సైనికుడు వేమిరెడ్డి అప్పలనాయుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాత కర్నవానిపాలేనికి చెందిన వేమిరెడ్డి అనారోగ్యంతో ఆర్మీలో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. రియల్ ఏస్టేట్ వ్యవహారాలు చూస్తూ.. భార్య సుజాత, నాలుగేళ్ల కుమారుడితో నివసిస్తున్నాడు. చినగంట్యాడలో ఒక స్థలం విషయంలో అప్పలనాయుడుకి స్థానికులు బంకా రాము, అతని అన్న కుమారుడు బంకా అశోక్‌తో గొడవలున్నాయి. తమ మాట వినడం లేదని ప్లాన్ ప్రకారం వేమిరెడ్డిపై కత్తితో దాడి చేసి చంపినట్లు నిందితులు పోలీసులకు చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్