నక్కపల్లి: హోంమంత్రి ఇంటి వద్ద రాజశ్యామల హోమం

నక్కపల్లిలో రాష్ట్ర హోం శాఖామంత్రి వంగలపూడి అనిత ఇంటి వద్ద ఆదివారం రాజశ్యామల సహిత లక్ష్మి నరసింహ స్వామి హోమాన్ని నిర్వహించారు. ఈ హోమంలో పాల్గొన్న మంత్రి శాస్త్రోక్తంగా పూజ క్రతువులు నిర్వహించారు. అనంతరం ఆమెను వేద పండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ హోమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. స్థానిక టిడిపి నేతలు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్