బాధితుల శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

యలమంచిలి నియోజకవర్గం పెదకలవలపల్లిలో ఎన్ఏఓబీ బాధితుల నిరసన శిబిరాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ బుధవారం సందర్శించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ఏఓబీ నిర్మించిన గోడ వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దిన్ బాబు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంగనాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్