వరి పంటను పరిశీలించిన వ్యవసాయాధికారి

వేంపల్లి మండలం అలిరెడ్డిపల్లె పంచాయతీ పరిధిలోని అలిరెడ్డిపల్లె, తువ్వపల్లె గ్రామాల్లో సాగు చేసిన వరి పంట గురువారం రాత్రి కురిసిన వర్షానికి దెబ్బతింది. శుక్రవారం ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంటను మండల వ్యవసాయ అధికారి రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి నష్టపోయిన పంట అంచనాలు వేసి నివేదికలు తయారుచేసి ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్