జనసేనకు భారీ షాక్.. వైసీపీలోకి కీలక నేత జంప్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన కో-ఆర్డినేటర్‌గా ఉన్న పితాని బాలకృష్ణ.. శ‌నివారం జనసేన పార్టీకి రాజీనామా చేసి సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్‌ ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పితాని బాలకృష్ణతో పాటు పలువురు జనసేన నేతలు వైసీపీలో చేరారు.

సంబంధిత పోస్ట్