ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలు రేపటి నుంచి ప్రభుత్వ ఆఫీసులకు పసుపు బిళ్లలతో వెళ్లాలన్నారు. అలా వెళ్లిన కార్యకర్తలను అధికారులు కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టి.. టీ ఇచ్చి మీ పని చేసి పెట్టేలా అధికారులను లైన్లో పెడతానని అన్నారు. తన మాట వినని అధికారుల సంగతి కూడా తేలుస్తానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.