సరిగ్గా 41 ఏళ్ల క్రితం.. జూన్ 18, 1983. జింబాబ్వేతో వరల్డ్ కప్ మ్యాచ్. భారత్ 9 రన్స్కే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆ దశలో బ్యాటింగ్కు వచ్చారు కపిల్ దేవ్. 138 బంతుల్లో 175 రన్స్(నాటౌట్)తో టీమిండియా స్కోరును 266 పరుగులకు చేర్చారు. ఛేజింగ్లో జింబాబ్వే 235 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో వారం తర్వాత తమ తొలి వన్డే ప్రపంచకప్ను గెలిచింది భారత జట్టు.