కవితను కలిసిన మాజీ మంత్రులు సబిత, సత్యవతి (వీడియో)

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆ పార్టీ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ములకాత్‌లో కలిశారు. కవిత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. కాగా ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు జులై 3 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో కవితను మార్చి 15న అధికారులు ఆమె నివాసంలో అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్